శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (16:45 IST)

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డొస్తున్నాడనీ భర్తను చంపి భార్య - సహకరించిన కుమారుడు

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహి

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. ఇటీవల ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు ఓ మహిళ చేసిన ప్రయత్నం విఫలమై జైలు ఊచలు లెక్కిస్తున్న విషయతెల్సిందే. ఇపుడు తాజాగా తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య చంపేసింది. ఇందుకోసం కుమారుడు సహకరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్య(45), పార్వతమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి శ్రీకాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, పార్వతమ్మకు అదేప్రాంతానికి చెందిన రాములు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త మల్లయ్య అడ్డుతగులడమే కాకుండా, వారిద్దరినీ హెచ్చరిస్తూ వచ్చాడు. 
 
దీంతో ప్రియుడు రాములు, కుమారుడు శ్రీకాంత్‌లతో కలిసి భర్త మల్లయ్యను భార్య పార్వతమ్మ మట్టుబెట్టింది. ఆతర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా గోనె సంచల్లో కట్టి నాగనూల్ చెరువులో పడేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టిగా అసలు విషయం వెల్లడైంది. దీంతో పార్వతమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కింది. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.