బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:29 IST)

అరటి పండు గుజ్జు, వంటసోడాతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?

అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు ర

అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. టమోటా గుజ్జును ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.