1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:23 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కరువు... చెన్నైకు ఒకటే ఫోన్లు

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ క

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు మరింత తారాస్థాయిలో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులకు డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రజలు చెన్నై వాసులకు పదేపదే ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా చెన్నై నుంచి వస్తున్నారంటే చాలు, ఏటీఎంలలో కరెన్సీ నోట్లు తీసుకురావాలంటూ ఏపీ ప్రజలు బతిమలాడుతున్నారు. 
 
తమకు తెలిసిన వారు ఎవరైనా చెన్నై నుంచి తిరిగి ఏపీకి వస్తున్నారంటే "ఇక్కడ కరెన్సీకి కరువు వచ్చింది. కాస్త కరెన్సీ నోట్లు ఉంటే తీసుకు రండి. కావాలంటే నాలుగు రూపాయలు ఎక్కువైనా తీసుకోండి ప్లీజ్‌" అంటూ ప్రాధేయపడుతున్నారు. 
 
ఏపీలో ఇప్పుడు ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు దొరకడం లేదు. దీంతో చెన్నై నుంచి వస్తున్న వారికి డబ్బు తెమ్మని ఏపీ నుంచి ఒకటే ఫోన్లు వెళ్తున్నాయట. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ వారు వాపోతున్నారు.