శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By selvi
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (15:35 IST)

#SRMgroup రమదా ప్లాజాలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్

చెన్నైలోని ఐదు నక్షత్ర హోటల్ రమదా ప్లాజాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది.

చెన్నైలోని ఐదు నక్షత్ర హోటల్ రమదా ప్లాజాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది. ఎస్ఆర్ఎం గ్రూపుకు చెందిన హోటల్స్‌లలో ఒకటైన ఈ రమదా ప్లాజా అన్ని రకాల పండ్లు, కేక్ తయారీకి కావలసిన పదార్థాలను మద్యంలో కలిపి కొన్ని రోజుల పాటు నిల్వ వుంచి క్రిస్మస్ కేకును తయారు చేసేందుకుగాను ఈ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
 
స్థానిక గిండీ సర్దార్ పటేల్ రోడ్డులో వున్న ఈ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన కాన్సులేట్ జనరల్స్, హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నక్షత్ర హోటల్ జీఎం సందీప్ భట్నాగర్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో వివిధ రకాల మద్యం, డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించారు.
 
సాధారణంగా డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ కేస్ మిక్సింగ్ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. ఈ కేక్ మిక్సింగ్ పద్ధతి 17వ శతాబ్దం నుంచే ప్రారంభమైనట్లు విశ్వాసం. సీజనల్‌లో సాగుబడి అయ్యే పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో సంప్రదాయ క్రిస్మస్ ప్లమ్ కేక్‌లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే.