శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (11:19 IST)

చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తమ ఆటగాళ్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తమ ఆటగాళ్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం వల్లే చిత్తుగా ఓడిపోయామన్నారు. 
 
క్రీజులో కుదురుకునేంత వరకైనా వికెట్లను అంటిపెట్టుకుని ఉండాల్సిందన్నారు. శుక్రవారం జరిగే చివరి టీ20లో మన బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. లేనిపక్షంలో సిరీస్ కోల్పోయే ప్రమాదముందన్నారు. 
 
మైదానంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం 120 శాతం కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు తమకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా ఆసీస్ పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్‌ను కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి భారత వెన్ను విరిచాడన్నారు.