శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 జనవరి 2018 (17:56 IST)

సఫారీలతో టెస్టు: కోహ్లీ ఇన్నింగ్స్ అదుర్స్.. 307 పరుగులకు ఆలౌట్

సఫారీలతో సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌటయ్యింది. సారథి విరాట్ కోహ్లీ (153; 217 బంతుల్లో 15×4) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో పాటే జట

సఫారీలతో సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌటయ్యింది. సారథి విరాట్ కోహ్లీ (153; 217 బంతుల్లో 15×4) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో పాటే జట్టు తొలి ఇన్నింగ్స్‌కూ తెరపడింది. 92.1 ఓవర్లకు 307 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 335కు 28 పరుగుల దూరంలో నిలిచింది.
 
టీమిండియా బ్యాటింగ్‌లో ఓవైపు వరుసగా వికెట్లు నేలకూలుతున్నా కోహ్లీ ఏకాగ్రత కోల్పోకుండా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 217 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి, చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ ప్రతిభతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. దీంతో, దక్షిణాఫ్రికా కన్నా తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు వెనుకబడి ఉంది.
 
భారత బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ 46 పరుగులతో ఓకే అనిపించాడు. చివర్లో కోహ్లీకి అండగా నిలబడ్డ అశ్విన్ 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగిలిన వారిలో రాహుల్ 10, పుజారా డకౌట్, రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, పాండ్యా 15, షమీ 1, ఇషాంత్ శర్మ 3 పరుగులు సాధించారు.  సఫారీ బౌలర్లలో మోర్కెల్ నాలుగు వికెట్లు తీయగా,  మహారాజ్, ఫిలాండర్, రబాడా, ఎన్గిడిలు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.