శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (11:57 IST)

ఆహారానికి తర్వాత గోరువెచ్చని సూప్ తీసుకోవచ్చా? ఫ్రిజ్ వాటర్ తీసుకోవచ్చా?

ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ తీసుకోవడం మంచిదా? లేకుంటే ఫ్రిజ్ వాటర్ తీసుకోవచ్చా? అనే డౌట్ మీలో ఉంటే ఈ స్టోరీ చదవండి. ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ ట్రీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నారు. 
 
గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆహారం తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు ఆరోగ్యానికి కీడు చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రిజ్ వాటర్ మాత్రం తీసుకోకూడదు. 
 
కానీ చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి కీడు చేసే వ్యాధులు ఏర్పడుతాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు ఫ్రిజ్ వాటర్ తీసుకోవడంతో ఏర్పడతాయి. ఇంకా అజీర్ణం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి జరుగుతాయి. ఫ్రిజ్ వాటర్‌ను వాడుతూ ఉంటే గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీరే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నమాట.