శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (17:36 IST)

మన శరీరంలో అవయవాలు ఏయే వేళల్లో ఏమేమి చేస్తాయో తెలుసా...!

ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్రపోవాలి. ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంతమంది టైం లేకుండా చేస్తారనుకోండి. అది వేరే విషయం. అయితే మనం

ఫలానా సమయానికి ఫలానా పని చేయాలి. ఫలానా వ్యక్తిని కలవాలి. ఆ టైంకి భోజనం చేయాలి. ఇంకో టైంకి ఇంకో పని చేయాలి. ఆ సమయానికి నిద్రపోవాలి. ఇలా మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తుంటాం. కొంతమంది టైం లేకుండా చేస్తారనుకోండి. అది వేరే విషయం. అయితే మనం ఏ పనిచేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్ధిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే. 
 
మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్‌గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసే కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం కలుగుతుంది. ఈ క్రమంలో అసలు ఏయే భాగాలు ఏయే సమయాల్లో యాక్టివ్‌గా పనిచేస్తాయో అవి పనిచేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య
ప్రొటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాన్ని పండ్లను ఈ సమయంలో బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయట.
 
ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య
ఈ సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరీరంలో జరిగే జీవక్రియలను గాడిలో పెడుతుందట. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుందట.
 
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య
ఈ సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుందట. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చూస్తుందట. దీనివల్ల శరీర కణాలకు శక్తి అందుతుందట.
 
మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు
ఈ సమయంలో చిన్న పేగులు అలర్ట్‌గా ఉండి బాగా పనిచేస్తాయట. మనం తిన్న బ్రేక్ ఫాస్ట్, లంచ్‌ల జీర్ణక్రియను ముగిస్తుంటాయి.
 
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఈ సమయంలో మన మూత్రాశయం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగాలి
 
సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు
ఈ సమయంలోనూ మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడబోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి.
 
రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య
ఈ సమయంలో పెరికార్టియం ఉత్తేజంగా ఉంటుందట. ఈ టైంలో రాత్రి భోజనాన్ని ఖచ్చితంగా ముగించాలట. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుందట.
 
రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య
ఈ సమయంలో భోజనం అస్సలు చేయకూడదట. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయట. ఇవి శరీర మెటాబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్థీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి.
 
రాత్రి 11 నుంచి 1 గంట మధ్య
ఈ సమయంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఈ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుందట. 
 
రాత్రి 1 నుంచి ఉదయం 3 గంటల మధ్య
ఈ సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుందట. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుందట. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటకు వెళ్ళవట. 
 
ఉదయం 3 నుంచి 5మధ్య
ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయట. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలు బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలట.