శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By TJ
Last Modified: శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:33 IST)

10 రూపాయలతో మీ పిల్లల ఆరోగ్యం పదిలం...

రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిల

రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోను కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తుంది.
 
పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ ఖచ్చితంగా ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. రాగుల్లో క్రొవ్వు తక్కువ కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం వంటివి కాకుండా రాగులు తీసుకుంటే బరువు కంట్రోల్ అవుతుంది. 
 
28 రోజులు నిండిన వారికి రాగిజావను పెడుతుంటారు పెద్దవారు. అది చాలామంచిది. రాగి జావను మితంగా తీసుకోవాలి. అదే ఎక్కువగా తీసుకుంటే విషంతో సమానమంటున్నారు వైద్య నిపుణులు.