శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:33 IST)

వరుసకు చిన్నాన్న.. అమ్మాయిపై అత్యాచారం.. మాత్రలిచ్చి గర్భస్రావం..

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడైన బాబాయ్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని విరుదాచలంలో 15ఏళ్ల బాలికపై చోటుచేసుకుంది. కుమార్తె వరసయ్యే బాలికపై బాబాయ్ అనేక మార్లు దురాగతానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. విరుదాచలంకు చెందిన వల్లియం గ్రామానికి చెందిన వ్యక్తి చిన్నదురై. ఇతని పక్కింటిలో పదో తరగతి చదివే 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. ఆ బాలికకు చిన్నదురై చిన్నాన్న అవుతాడు. తనకు కూతురు వరసయ్యే ఆ బాలికపై చిన్నదురై కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకుని.. చిన్నదురై 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే బాలికకే అవమానమని బెదిరించాడు. ఇలా అనేకమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం ధరించిన బాలికకు గర్భస్రావం అయ్యేలా మాత్రలిచ్చాడు కామాంధుడు.
 
గత ఏడాది పాటు ఈ అకృత్యం జరుగుతోంది. ఈ వ్యవహారం ఎలాగో బాలిక తల్లిదండ్రులకు తెలియరావడంతో.. వారు పోలీసులకు చిన్నదురైపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నదురైని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.