శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (18:29 IST)

ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లి నిశ్చయం కావడంతో గొంతు కోసేశాడు..

ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడ

ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఘటన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ద‌మ్మ‌పేట మండ‌లం నెమ‌లిపేట‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ప్రేమిస్తున్నానంటూ పల్లవి అనే యువతి వెంట పడుతోన్న శ్రీనివాసరాజు అనే ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. పల్లవి స్థానిక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన యువకుడు చాకుతో ఆమె మెడను కోసేశాడు. 
 
ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఈ దుర్ఘటన సంభవించడంతో విద్యార్థులు భయంతో జడుసుకున్నారు. ఇటీవలే ప‌ల్ల‌వికి వివాహం నిశ్చ‌యం కావ‌డంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.

పక్కా ప్రణాళికతో దాడి చేసిన శ్రీనివాస్.. దారుణానికి ఒడిగట్టడానికే ముందే పురుగుల మందు తాగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవళికను పొడిచి చంపిన కాసేపటికి అతడు కూడా అక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.