1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 మే 2018 (19:51 IST)

కైలాస్ యాత్ర... మానస్ సరోవర్‌లో స్నానానికి చైనా అడ్డుకుంటుందట... కానీ...

కైలాస్ మానస సరోవర్ యాత్ర అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వున్న హిమాలయ ప్రాంతం. కైలాస్ మానస్ సరోవర్లో పుణ్య స్నానాలు చేయాలంటే టిబెట్ నుంచి చైనా ద్వారా వెళ్లి అక్కడ స్నానాలు చేయాల్సి వుంటుంది. ఐతే తాజాగా మానస సరోవరంలో పుణ్య స్నానాలు చేసేందుకు చైనా

కైలాస్ మానస సరోవర్ యాత్ర అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వున్న హిమాలయ ప్రాంతం. కైలాస్ మానస్ సరోవర్లో పుణ్య స్నానాలు చేయాలంటే టిబెట్ నుంచి చైనా ద్వారా వెళ్లి అక్కడ స్నానాలు చేయాల్సి వుంటుంది. ఐతే తాజాగా మానస సరోవరంలో పుణ్య స్నానాలు చేసేందుకు చైనా అడ్డుకుంటోందంటూ వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి భారతదేశం నుంచి వెళ్లిన భక్తుల బృందానికి నాయకత్వం వహించిన సంజీవ్ ఠాకూర్ అనే పురోహితుడు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. 
 
తమను సరోవరంలో పుణ్య స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. పుణ్య స్నానాలకు అనుమతి లేనప్పుడు తమకు వీసాలు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తనతో పాటు 80 మంది భక్తులున్నారనీ, తామంతా ఇక్కడ పవిత్ర స్నానాలు చేసేంత వరకూ కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఐతే దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోలా స్పందించారు. 
 
కైలాస్ మానస సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకించి కొన్ని నిర్దుష్ట ప్రాంతాలు వుంటాయనీ, భక్తులు అక్కడ మాత్రమే స్నానమాచరించాలని తెలియజెప్పారు. ఎక్కడబడితే అక్కడ పుణ్య స్నానాలు చేయాలంటే వీలుకాదని ఆమె వివరించారు. మరి అక్కడికెళ్లిన భక్తుల బృందం నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఎక్కడబడితే అక్కడ చేయాలని అనుకుంటున్నారా?