బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (12:38 IST)

నిజం మాట్లాడితే "యాంటీ మోడీ" అనేస్తారా? ప్రకాశ్ రాజ్ ప్రశ్న.. కేసు నమోదు

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు.

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన మహిళా సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలంటూ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై ప్రకాశ్ రాజ్ మళ్లీ స్పందించారు. దేశ ప్రధానిగా ఆయనంటే గౌరవం ఉంది.. అలా అని అన్నింటికీ ఆయనకు వంతపాడలేను అని అన్నారు. పైగా, తాను నిజం మాట్లాడతానని స్పష్టం చేశారు. 
 
తానెప్పుడైనా, ఎక్కడైనా సరే నిజమే మాట్లాడతానని అన్నారు. ప్రధాని మోడీ విషయంలో కూడా తాను నిజమే మాట్లాడానని ఆయన చెప్పారు. నిజం మాట్లాడినంత మాత్రానికే 'యాంటీ మోడీ' అనేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ మన దేశ ప్రధాని అని, ఆయనపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆయన తెలిపారు. అదే సమయంలో అన్ని విషయాల్లోనూ తాను ఆయనతో ఏకీభవించలేనని చెప్పారు. ఇక తనను దూషించే వారు, విమర్శించేవారిని ఉద్దేశిస్తూ, వారెవరూ తన ఎదురుగా వచ్చి అలా చేయలేరని ఆయన అన్నారు. అంత ధైర్యం వారికి లేదని ఆయన తెలిపారు. 
 
ఇదిలావుండగా, ఇటీవల చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కేసు నమోదైంది. కొందరు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.