శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:56 IST)

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...

జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ పాఠశాలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి బాలికకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలికను చూసేందుకు కొంతమంది సీనియర్ విద్యార్థులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన సీనియర్ విద్యార్థులు.. ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆ బాధిత బాలిక రహస్యంగా ఉంచింది. అయితే ఆ బాలిక గర్భందాల్చినట్టు తాజాగా తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు, నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.