శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (17:55 IST)

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు. వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు క

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతున్నారు.

వన్యమృగాల వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న బాహుబలి 2 చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌‌ను లైవ్‌లో చేయాలనుకున్న కేరళ యువకుడిపై ఏనుగు తొండంతో దాడి చేసింది. 
 
అచ్చం బాహుబలి2 తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడు ఏనుగు తొండంపై ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.

అయితే ఏనుగు ఒక్కసారిగా అతన్ని తొండంతో విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి అతడి స్నేహితుడు కాపాడాడు.  తాజాగా సెల్ఫీ మీద‌ మోజుతో ఏనుగు వ‌ద్ద‌కు వెళ్లిన 40 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లో గురువారం చోటుచేసుకుంది.
 
కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఓ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేస్తోన్న సాదిఖ్ అనే వ్య‌క్తి ప‌ని ముగించుకుని ఇంటికి వెళ్తోన్న స‌మ‌యంలో అటవీ ప్రాంతంలోని హైవేపై ఓ ఏనుగుని చూశాడు. సంతోషంతో దాని వ‌ద్ద‌కు వెళ్లి త‌న మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఏనుగు ఒక్కసారిగా తొండంతో దాడి చేయ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.