శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (13:33 IST)

కన్నకూతురిని స్నేహితులకు గిఫ్ట్‌గా ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారా

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. రక్తం పంచుకుపుట్టిన కన్నకూతురిపైనే కన్నేశాడు.



కన్నకూతురిపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. కన్నకూతురుని అతడి స్నేహితులకు కూడా పంచిపెట్టాడు ఆ దుర్మార్గుడు. తన స్నేహితులతో కలిసి కన్నకూతురిపై ఆ కామాంధ తండ్రి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిందితుడైన తండ్రి తన కూతురు (35)తో కలిసి ఏప్రిల్ 15 సాయంత్రం ఓ జాతరకు వెళ్లారు. అనంతరం అతడు తన స్నేహితుడైన మాన్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. స్నేహితులతో కలిసి జాతరకు వెళ్తున్నామని కూతురుకి నచ్చజెప్పాడు. ఆపై స్నేహితులతో పాటు నిందితుడు.. అతడి స్నేహితుడైన మిరాజ్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు.
 
ఆ ఇంట్లోనే కన్నకూతురిని తన స్నేహితులకు ఆ నీచ తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చాడు. స్నేహితులతో కలిసి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత 18 గంటల పాటు ఆమెను మిరాజ్ తన ఇంట్లోనే బంధించేశాడు. తండ్రి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి, అతడి మరో స్నేహితుడు మాన్ సింగ్ పరారీలో ఉన్నారు.