గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (11:11 IST)

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ముసుగులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోన

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ముసుగులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్ని అని అందరినీ నమ్మించడు. భక్తి ముసుగులో భక్తులను మోసం చేశాడు. 
 
ఏకంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలను కూడా నయం చేసేస్తానని మభ్యపెట్టి బాగా డబ్బు గుంజేశాడు. ఇతని వద్దకు సాయం కోసం ఓ మహిళ రావడంతో ఆమెను లోబరుచుకోవాలని సాధువు ప్లాన్ చేశాడు. ఆమెను అతను "గత జన్మలో నువ్వు నా భార్యవు" అంటూ వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. అతనిపైనున్న గుడ్డి నమ్మకంతో ఆమె కూడా అతని వెంట వెళ్లేది. 
 
ఒకసారి అలాగే ఆమెను అసోం తీసుకెళ్లిన సాధువు సాయిలాల్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాధువును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఫిర్యాదు చేసిన మహిళ గత జన్మలో తన భార్య అని, అందుకే ఆమెతో అలా ప్రవర్తించానని సాధువు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.