శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (14:17 IST)

గుండెలు పిండేసే ఘటన... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కూడా....

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. అలాంటి జవాన్లు ఉగ్రమూకల తూటాలకు బలవుతున్నారు. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ప్రాణాలు ఫణంగా పెట్టి దే

భారత ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో తీవ్రవాదులతో నిత్యం పోరాడుతూ దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్నారు. అలాంటి జవాన్లు ఉగ్రమూకల తూటాలకు బలవుతున్నారు. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ప్రాణాలు ఫణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.. జరుగుతున్నాయి కూడా. తాజాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్మీ అధికారి చేసిన ఫోన్ వివరాలు ప్రతి ఒక్కరి గుండెలు పిండేస్తున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబేదార్ కుమార్ ఉత్తర కాశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన భార్య దేవి సొంతూరులో ఉంటుంది. కాగా, ఆదివారం కర్వాచౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవి ఉపవాసంతో పూజలు చేసింది. 
 
మరోవైపు ఆదివారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో శత్రువు తూటాకి తీవ్రంగా గాయపడిన కుమార్ తన భార్యకు ఫోన్ చేసి... 'నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. 
 
ఉగ్రవాదుల కాల్పుల్లో కుమార్ మృతి చెందినట్టు ఉన్నతాధికారులు సోమవారం ఉందయం ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మాటలు విన్న దేవి కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చి తేరుకునేలా చేశారు. 
 
కాగా, వీర సుబేదారు కుమార్‌ భౌతికకాయానికి మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యింది.