శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:53 IST)

రాహుల్ 'పప్పు' కాదు.. నిప్పు... : శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన వి

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. 
 
తాజాగా ఆయన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయన్నారు. ఈ రెండింటివల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. 
 
దేశంలో చాలా మంది నేతలు తమకుతామే గొప్ప అని విర్రవీగుతున్నారని... రాహుల్ గాంధీని 'పప్పు' అంటూ సంబోధిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ ప్రభావం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. 
 
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ స్పష్టమైన ప్రభావం చూపే పరిస్థితి నెలకొందన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి రాహుల్‌కు మాత్రమే ఉందని చెప్పారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన... రాహుల్ గాంధీపై పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం.