శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:06 IST)

ఫేస్‌బుక్‌లో పరిచయం... ముంబై నటిపై రాజస్థాన్‌లో అత్యాచారం...

ముంబైకు చెందిన ఓ నటిపై రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఈ లైంగికదాడికి పాల్పడింది సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన వ్యక్తికావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ముంబైకు చెందిన ఓ నటిపై రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఈ లైంగికదాడికి పాల్పడింది సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన వ్యక్తికావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై ఆల్వార్‌కు చెందిన ఓ యువతి అటు మోడలింగ్, ఇటు సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో 25 యేళ్ల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినేనని ఆమెను నమ్మించాడు. ఇద్దరి మధ్య మాటలు సాగి, పరిచయం మరింతలోతుకు చేరుకున్న వేళ, వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు.
 
దీంతో ఆ నటి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లింది. అతను బాధితురాలిని తన కుటుంబీకులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. ఆపై ఇద్దరూ కలసి ఈ నెల 4వ తేదీన రాజస్థాన్‌లోని నీమ్ రానాకు కలసి వెళ్లారు. అక్కడ రాత్రి పూట ఉండేందుకు గదిని అద్దెకు తీసుకున్నారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆ నటిపై నీమ్ రానా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితురాలు ముంబైకు చేరుకుని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తికోసం గాలిస్తున్నారు.