శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:41 IST)

'బ్లూవేల్‌ ఛాలెంజ్' : బ్లేడుతో నాలుక కోసుకున్నాడు...

సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్. అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తోంది.

సరదాగా మొదలై చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించే దారుణమైన మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్. అమాయక పిల్లల్ని బలితీసుకుంటున్న ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా భారత్‌లోనూ పంజా విసురుతోంది. 
 
10 నుంచి 14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట చిన్నారులను హిప్నటైజ్‌ చేస్తుంది. భావోద్వేగాలతో పిల్లలను మృత్యుఒడిలోకి తోసేస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో ఇప్పటికే వందలాది మంది పిల్లలను పొట్టనపెట్టుకున్న ఈ ఆట.. ఇప్పుడు భారత్‌లో పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ఈ ప్రమాదకరమైన గేమ్‌ నుంచి రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
తాజాగా, ప్రాణాంతక ఆన్‌లైన్‌ క్రీడ ‘బ్లూవేల్‌’ బారిన పడి చెన్నైకు చెందిన ఓ యువకుడు చేతులు, నాలుకను కోసుకున్నా డు. చెన్నై నగర శివారు ప్రాంతమైన పల్లావరం సమీపంలోని పోళిచ్చళూరు ఆండాల్‌నగర్‌లో ఒడిషాకు చెందిన యువకుడు ప్రసాద్‌(21) వారంరోజులుగా సెల్‌ఫోన్‌తోనే కాలం గడుపుతూ, ముభావంగా కనిపించాడు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ బ్లేడుతో చేతులు, నాలుకను కోసుకుని అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.