శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:44 IST)

భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు.. జాతికిదే ఘనమైన పండుగ: పవన్‌ కల్యాణ్‌

దేశ ప్రజలకు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.

దేశ ప్రజలకు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. 
 
‘వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు’ అని సోమవారం ఆయన ట్వీట్‌చేశారు.
 
అంతకుముందు, మంగళవారం ఉదయం 7 గంటలకో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. 
 
అనంతరం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.