శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:49 IST)

ఆధార్‌ను పుట్టించింది మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడ

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగింది. దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు. 
 
అలాంటి మోదీ ప్రస్తుతం ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని రేణుకా ఆవేదన వ్యక్తం చేశారు.
 
తన నవ్వుపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రధాని స్థాయిని మరిచిపోయారన్నారు. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాంటి కామెంట్ల్ చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి సరిపోయింది. ఇదే వ్యాఖ్యలు బయటెక్కడైనా చేసి వుంటే ఈపాటికి మోదీపై చట్టప్రకారం కేసు నమోదు చేసి వుండేదాన్నంటూ రేణుకా చౌదరి హెచ్చరించారు.