శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (14:30 IST)

ఇంటికొచ్చి లైంగికంగా వేధించిన బావ- విషమిచ్చి చంపేసిన మరదలు

లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టా

లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుపై ముమ్మరంగా విచారణ జరిపారు. చివరికి సుభాష్ హత్యకు గురయ్యాడని తెలిసింది. హత్య చేసింది కూడా అతని మరదలేనని పోలీసులు కనుగొన్నారు. 
 
సుభాష్ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు ఆయ‌న మ‌ర‌ద‌లు సునీతపై అనుమానం క‌లిగింది. విచారణలో సునీత నిజాన్ని ఒప్పేసుకుంది. తన ఇంటికి వచ్చే బావ లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకే అతడికి విషమిచ్చి హ‌త్య చేశానని వెల్లడించింది. ఆపై మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేసిన‌ట్లు చెప్పింది. సుభాష్ మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.