శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By kumar
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (15:38 IST)

అబార్షన్... ఐతే ఈ పిండానికి తండ్రెవరో చెప్పండి? పోలీసులకు యువతి ప్రశ్న

ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కడుపులో పెరిగిన పిండానికి తండ్రి ఎవరో చెప్పాలని కోరడంతో అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శియోనీ జిల్లాకు

ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కడుపులో పెరిగిన పిండానికి తండ్రి ఎవరో చెప్పాలని కోరడంతో అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శియోనీ జిల్లాకు చెందిన పంకజ్ శివాహరే అనే యువకుడికి జబల్‌పూర్‌కి చెందిన రీటా అనే యువతితో చాలా కాలం క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత రీటా గర్భం దాల్చడం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న పంకజ్ ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, రీటా కడుపులో పెరుగుతున్న పిండానికి తను తండ్రిని కాదని చెప్పి ఆమెను పుట్టింటికి పంపేసాడు.
 
ఇదిలావుండగా ప్రమాదవశాత్తూ రీటా కడుపులోని పిండం దెబ్బతిని అబార్షన్ చేయించారు. అయితే అబార్షన్ చేయించుకున్న తర్వాత ఆమె ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఈ పిండానికి తండ్రి ఎవరో తెలియడానికి డిఎన్ఏ పరీక్ష చేయాలని కోరింది. దీనితో పోలీసులు కూడా వారిరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి డిఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.