శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (17:01 IST)

ప్రేమించలేదని కత్తితో 40 పోట్లు పొడిచాడు.. ఎక్కడ?

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. తనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా కొందరు యువకులు విచక్షణ కోల్పోయి యువతులను చంపేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యా చిగురించాల్సిందే. అవతలి వ్యక్తిత

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. తనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా కొందరు యువకులు విచక్షణ కోల్పోయి యువతులను చంపేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యా చిగురించాల్సిందే. అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా ప్రేమిస్తే అది ఒన్ సైడ్ లవ్ అవుతుంది. ఐతే తను ప్రేమిస్తున్నా అవతలి వ్యక్తి ప్రేమించడం లేదని వారిపై దాడికి పాల్పడటం, చంపేయడం లాంటివి చేయడం షరామామూలే అయిపోయింది. తమిళనాడు రాష్ట్రంలో అలాంటి సంఘటనే జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని 40 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
 
చెన్నై శివారులోని మధురవాయిల్‌కు చెందిన అశ్విని.. కే.కే.నగర్ లోని మీనాక్షి కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. మధురవాయిల్ లోనే ఉంటున్న అళగేశన్ గత కొన్ని నెలలుగా అశ్వినిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అళగేశన్ వినిపించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అశ్విని. పోలీసులు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆ తరువాతైనా అళగేశన్ సైలెంట్ అయిపోతాడని అనుకుంది అశ్విని. కానీ అతనే తన ప్రాణాన్ని తీస్తాడని ఊహించలేకుండా పోయింది. 
 
తనను ప్రేమించకపోగా.. పోలీసులతో కొట్టిస్తావా అంటూ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న అశ్వినిని నడి రోడ్డుపై 40 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు చూస్తుండగా అళగేశన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.