మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (14:25 IST)

రూ.25వేలిచ్చి ప్రియురాలిని సొంతం చేసుకున్నాడు.. భర్త కూడా ఓకే చెప్పాడు.. ఎక్కడ?

పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమ

పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమెను వెతికిపట్టుకున్నారు. అయినా రెండోసారి కూడా పారిపోయింది. చివరికి ప్రియుడితోనే వుంటానని పోలీసులతో చెప్పింది. ప్రియుడు కూడా ఆమెతో వుంటానని చెప్పి అడ్వాన్స్‌గా రూ.25వేలిచ్చి దక్కించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా మనప్పారై ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. బలవంతంగా ఆమెను తల్లిదండ్రులు మేనమామకిచ్చి వివాహం జరిపించారు. అతని నుంచి పారిపోయిన దేవిని పోలీసులు గుర్తించి భర్తకు అప్పగించారు. 
 
అయినా రెండోసారి కూడా ప్రియుడి చెంతకే చేరిపోయింది. చివరికి పోలీసుల పంచాయతీతో దేవి లక్షరూపాయలిస్తే ఆమెను ప్రియుడికి వదిలిపెట్టేస్తానని చెప్పాడు. దీంతో రెండు రోజుల పాటు ముగ్గురికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసుల చర్చలతో వారంతా ఒక అంగీకారానికి వచ్చారు. లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పి, అడ్వాన్స్‌గా రూ.25,000లను చెల్లించి దేవిని తనతో కాపురానికి ప్రియుడు తీసుకెళ్లడంతో వివాదం సమసిపోయింది.