శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:52 IST)

ఢిల్లీ లిక్కర్ మాఫియా దాష్టీకం : మహిళ నగ్న ఊరేగింపు

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం చేరవేసిందన్న కోపంతో ఓ మహిళను చితకబాది, వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీల

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం చేరవేసిందన్న కోపంతో ఓ మహిళను చితకబాది, వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ పోలీస్‌ చౌకీ సమీపంలో మహిళ ప్రవీణ్ అనే మహిళ నివసిస్తోంది. ఈమె ఢిల్లీ మహిళా సంఘంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. అయితే, నారెళ్లలో చట్టవ్యతిరేకంగా లిక్కర్‌ అమ్ముతుండటాన్ని పసిగట్టిన ఆమె.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఢిల్లీ మహిళా కమీషన్‌కు చేరవేసింది. 
 
దీంతో వారు దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఆ మాఫియాకు చెందిన ఓ మహిళ కొందరు పురుషులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్‌పై గురువారం దాడికి తెగబడ్డారు. ఆమెను చితకబాది, వివస్త్రను చేసి నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. 
 
ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్‌తో పాటు.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్‌ శాఖకు నోటీసులు జారీ చేసింది.
 
అలాగే, సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు.