శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:42 IST)

గర్భిణీ స్త్రీలు.. నిమ్మకాయను కోసి దీపం వెలిగించవచ్చా?

హైందవ ధర్మం ప్రకారం స్త్రీ ఎంతో పవిత్రమైంది. ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. ఇంటిని నిలబెట్టాలంటే స్త్రీయే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. రెండు చేతులతో తల గీరుకోరాదు. 
 
అయినదానికీ కానిదానికి ఎప్పుడూ కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరో ఆకులో వడ్డించరాదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించాలి. గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు. 
 
గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించకూడదు. గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు. సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది. 
 
చేతితో ఎప్పుడూ అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు. ఏ వస్తువు అయినా ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుతారు. ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు, తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.