శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:41 IST)

అగ్గిపెట్టి ఉందా అని అడిగి.. 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లారు

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి కూడలిలో భుజంగ్ రెడ్డి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
 
నిన్న రాత్రి బైక్ వచ్చిన ఓ యువకుడు సిగరెట్ తీసుకొని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వమని అడిగాడు. యజమాని వొంగి కింద ఉన్న అగ్గిపెట్టి తీసి ఇచ్చే సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు దొంగలు. వెంటనే తేరుకున్న భుజంగ్ రెడ్డి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసి అరుస్తూ  పరిగెత్తుకుంటా వెళ్లాడు. 
 
అయినా  దొంగలు బైకు మీద పారిపోవడం వల్ల ఫలితం లేక పోయింది. భుజంగరెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషనును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్‌ను పరిశీలించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.