గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:07 IST)

చెల్లెమ్మా నీ కృషి అభినందనీయం... టీబీజీకేఎస్ ఫలితాలపై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ విభాగమైన టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం) విజయఢంకా మోగించింది.

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ విభాగమైన టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం) విజయఢంకా మోగించింది. శుక్రవారం వెల్లడైన పూర్తి ఫలితాల్లో మొత్తం 11 డివిజన్లకు గాను ఈ సంఘం ఏకంగా 9 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేసింది. విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా తెరాస గెలుపును అడ్డుకోలేకపోయాయి. 
 
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవితను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. అనైతికంగా కూటమిని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రలు టీబీజీకేఎస్ గెలుపును ఏమాత్రం ఆపలేకపోయాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 
అలాగే, ఈ ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ, కేటీఆర్ చెల్లెలు కె.కవిత మాట్లాడుతూ... టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞ‌తలు తెలియజేశారు. 
 
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్మికుల మనసు గెలుచుకునేలా పనిచేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 9 డివిజన్లను గెలుచుకున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.