శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:19 IST)

తెలంగాణాభివృద్ధికి కృషి.. కేటీఆర్ :: ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసం శ్రమిస్తున్నా : నారా లోకేశ్ (Video)

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుత్రులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రిగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొనసాగుతున్నారు. ఈయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. పైగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఓ కంపెనీ అని ఈ కంపెనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ పంచ్ అనే ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.