1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:36 IST)

హీరోయిన్ పాత్రలకు దూరంగా కోహ్లీ సతీమణి??

బాలీవుడ్‌లోని అగ్ర నటీమణుల్లో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఒకరు. ఈమె ఇప్పటికే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. 
 
లాక్డౌన్ సమయంలో నిర్మించిన 'పాతాళ్ లోక్' సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్‌కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఇదిలావుంటే, అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. హీరోయిన్ పాత్రలకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తోందనేది బీటౌన్ టాక్. 
 
2018లో విడుదలైన 'జీరో' సినిమా తర్వాత  అనుష్క పూర్తి స్థాయి పాత్రను ఇంత వరకు పోషించకపోవడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు.