శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (14:36 IST)

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ముహూర్తాన పాదం మోపిందోగానీ పూజా హెగ్డే దశ తిరిగిపోయింది. ఒక వైపు హీరోయిన్ పాత్రలతో పాటు... మరోవైపు ఐటమ్ సాంగులతో రెచ్చిపోతోంది. స్పష్టంగా చెప్పాలంటే... ఆమె ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే రాంచరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలోని ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. ఈ పాటలో పూజా హెగ్డే ఇరగదీసింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రిన్స్ మహేష్ బాబుతో 'మహర్షి', తాజాగా అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' చిత్రాలు చేసింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ మూవీలు. దీంతో ఈ అమ్మడు ఫేట్ మారిపోయింది. ముఖ్యంగా తన పారితోషికాన్ని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ను భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే భరించే స్థితిలో వున్నారు. 
 
పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె డేట్స్ దొరకడం గగనంగా మారిపోయింది. ఆ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ముందు పూజ కోటి రూపాయల వరకుతీసుకునేది. ఆ సినిమాకు రూ.1.4 కోట్ల వరకు తీసుకుందని వినికిడి. 
 
ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రెండు కోట్లకు పెంచేసిందట. ఈ రేటు విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్‌ను బట్టి పూజను బుక్ చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు మరి!