శ్రీదేవి మృతి.. సాదాసీదాగా జాన్వి కపూర్.. మేలో సోనమ్ కపూర్ పెళ్లి?  
                                          అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్లో శ్రీదే
                                       
                  
				  				  
				   
                  				  అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్లో శ్రీదేవి ఉదాసీనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
				  											
																													
									  మరాఠీ సూపర్ హిట్ అయిన సైరాత్ సినిమాను హిందీలో శశాంక్ ఖేతన్ ''దడఖ్'' పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్కతా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్లో సింపుల్ దుస్తులతో కనిపిస్తోంది. 
				  
	 
	ఇదిలా వుంటే.. శ్రీదేవి మృతితో కపూర్ ఫ్యామిలీ సభ్యులు విషాదంలో వున్నారు. త్వరలో శ్రీదేవి ఇంట శుభకార్యం జరుగనుంది. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది.
				  																								
	 
 
 
  
	
	
																		
									  గత రెండేళ్లుగా బిజినెస్మెన్ ఆనంద్ అహుజాతో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి గత మూడు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహా వేడుక జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.