శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (12:09 IST)

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత "వైఎస్ఆర్ బయోపిక్"

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు సూపర్ హిట్ ఖాతాలో చేరాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా పలు చిత్రాలు

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు సూపర్ హిట్ ఖాతాలో చేరాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా పలు చిత్రాలు నిర్మితంకానున్నాయి. ఈ కోవలో మహానటి సావిత్రి, స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్రల ఆధారంగా రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' పేరుతో ఓ చిత్రాన్ని తీస్తున్నారు. 
 
ఇపుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో రాజశేఖర్‌ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు టాలీవుడ్‌ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌.. నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని భావించారు.
 
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' వంటి బ్లాక్‌‌బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి.రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. ఇందుకు వైఎస్సార్‌ కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో బయోపిక్‌కు సంబంధించిన వివరాలను రాఘవ్‌ అధికారికంగా వెల్లడించనున్నారట.