శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (12:05 IST)

రూ.1000 కోట్లతో పౌరాణిక చిత్రం... హీరోలు ఎవరంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసే మాలీవుడ్ ప్రస్తుతం వారి పద్ధతికి భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
 
ప్రమఖ హీరో మోహన్ లాల్ హీరోగా 'రండామూళం' అనే చిత్రం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షో టైమ్ 5.20 గంటల పాటు. అందుకే 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
ఎంటీ వాసుదేవ నాయర్ రచించిన 'రండామూళం' అనే నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించబోతున్నారట. చూద్దాం ఇంత బడ్జెట్ సినిమా పట్టలెక్కుతుందో....? లేదో...?. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు మరో సూపర్‌స్టార్ మమ్ముట్టి కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు మాలీవుడ్ వర్గాల సమాచారం.