శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (17:35 IST)

ప్రభాస్-రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి.

టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి. 
 
తాజాగా బాహుబలిలో నాయకుడు, ప్రతినాయకుడిగా కనిపించి ప్రపంచ  వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్, రానా ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల పేర్లు వినగానే దర్శకుడు దశరథ్ పేరు గుర్తుకు వస్తుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సూపర్ కథతో సినిమాలను రూపొందించడంలో అతడు దిట్ట. 
 
అలాంటి సూపర్ దర్శకుడు కొత్తగా ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని, ఆ సినిమాలో ప్రభాస్, రానా కలిసి నటిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రానా, ప్రభాస్‌‍లను దశరథ్ కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. మరి ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి.