బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:12 IST)

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారున

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు తిరుగుబాటు చేశారని.. ఎన్డీఏలో వున్న చంద్రబాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సలహా ఇచ్చారు.

ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు వ్యతిరేకంగా, మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్ను సిన్హా నేతృత్వంలో సమావేశం నిర్వహించారని ఉండవల్లి గుర్తు చేసారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు వారితో కలిసి ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం చంద్రబాబు చేతుల్లో వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 
 
చంద్రబాబు మోదీకి బుద్ధి చెప్పాలంటే.. ఇదే సరైన తరుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసులకు, జైళ్లకు భయపడటం మానేసి.. ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.

దేశంలో జ్యుడీషియరీని ఎదుర్కోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అంటూ ఉండవల్లి విమర్శించారు. కాబట్టి కేసీఆర్ తరహాలో ఎదురుదాడికి దిగాలని ఉండవల్లి సూచించారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదన్నారు.