శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:35 IST)

3 సెకన్లలో 200 కి.మీ వేగంతో దూసుకెళ్లే బైక్... చూస్తారా(ఫోటోలు)

మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో రివ్వున దూసుకుపోయే ఎలక్ట్రిక్ సూపర్ బైక్ త్వరలోనే రోబోతోంది. లిక్విడ్ కూల్ ఏసీ ఇండక్షన్ మోటార్ సామర్థ్యంతో 68పిఎ

మూడంటే మూడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తర్వాత 200 కిలో మీటర్ల వేగంతో రివ్వున దూసుకుపోయే ఎలక్ట్రిక్ సూపర్ బైక్ త్వరలోనే రోబోతోంది. లిక్విడ్ కూల్ ఏసీ ఇండక్షన్ మోటార్ సామర్థ్యంతో 68పిఎస్ శక్తితో 84ఎన్ఎమ్ టార్క్‌తో ఈ మోటార్ బైకును తయారుచేశారు. 8400 ఆర్పీఎమ్ జనరేట్ అవుతుంది. 
 
ఎలక్ట్రిక్ మోటార్ బైకును పరిచయం చేసిన సందర్భంగా కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ టాప్ స్పీడుతో ప్రయాణించి ఏకంగా 200 కి.మీ వేగంతో వెళ్లగలుగుతుందని చెప్పారు. కాగా దీని బ్యాటరీని శ్యామ్ సంగ్ తయారుచేసింది. 200 కి.మీ వేగంతో నడిచే ఈ బైకును చార్జ్ చేసుకోవడం కూడా చాలా సులభం. 
 
కేవలం అర్థగంటలోనే 80 శాతం చార్జ్ చేసుకునే వీలుంది. ఈ మోటారు బైకును వచ్చే ఏడాది 2019 మార్చి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య వుంటుందని అంచనా వేస్తున్నారు. (ఎక్స్-షోరూం ధర)