శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (11:11 IST)

ఇంటిముందు ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం, హత్య.. గ్రామస్థుల ఆందోళన?

పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళనలు చేపట్టిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం.. కూచనపల్లి శివారులో చోటుచేసుకుంది.

పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళనలు చేపట్టిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం.. కూచనపల్లి శివారులో చోటుచేసుకుంది. 
 
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేయడంతో పాటు ప్రాణాలు తీశాడు. ఆపై చిన్నారి మృతదేహాన్ని గోదావరి ఒడ్డున నిర్మాణుష్య ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. బాలిక డెడ్‌ బాడీని కనుగొన్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే జరిగిన ఘటనపై రక్తం మరిగిన గ్రామస్థులు.. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ ఏకమయ్యారు. 44 వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు ఊరంతా కలిసి.. పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించింది. స్టేషన్ ముందే కూర్చొని.. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ గ్రామస్థులు చేశారు. అమ్మాయిల రక్షణకు ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా.. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని సోన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కేసులో మరో మైనర్ బాలుడికి కూడా సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. కేసుపై దర్యాప్తును వేగవంతంగా జరుపుతున్నామన్నారు.