శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:14 IST)

మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడ చంపండ్రి: నిందితుడి భార్య

దిశ హత్య నిందితులు శుక్రవారం ఉదయం పోలీసుల చేతుల్లో ఎన్ కౌంటర్లో మరణించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపైన ఎదురు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
 
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 
కాగా దిశను అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడిందని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. తెలంగాణలో దిశ ఇంటి వద్ద స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చారు.