శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (11:11 IST)

ఫిల్మ్ నగర్ ఆఫీసులు ఆ ఏరియాలుగా మారిపోయాయి: శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఒక్క అవకాశం లభిస్తే చాలు.. అని భావించి ఏదైనా చేసే అమ్మాయిలను ఓదార్చే వ్యాఖ్యలు చేసింది. "మ

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఒక్క అవకాశం లభిస్తే చాలు.. అని భావించి ఏదైనా చేసే అమ్మాయిలను ఓదార్చే వ్యాఖ్యలు చేసింది. "మనసుతో పడుకోని ఏ అమ్మాయి అయినా నా దృష్టిలో మలినం అంటని పవిత్ర" అని పేర్కొంది.


అమ్మాయిలు తప్పనిసరై తమ మనసులు చంపుకుని టాలీవుడ్‌లో జీవించాల్సి వస్తోందని చెప్పింది. నిత్యమూ ఎందరి చేతుల్లోనో నలిగినా కూడా అవకాశాలు లభించేది అంతంతమాత్రమేనని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇంకా కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ.. ఫిల్మ్ చాంబర్ ముందు చేసిన అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
కాగా తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై శ్రీరెడ్డి రోజుకో లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడి అనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బహిరంగ చర్చలో శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మాట్లాడుతూ., ఫిల్మ్ నగర్‌లోని అన్నీ ఆఫీసులు రెడ్‌లైట్‌ ఏరియాలుగా మారిపోయాయని.. సాయంత్రం ఆరు దాటితే చాలు విచ్చలవిడి అకృత్యాలకు అవి నిలయంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.