హీరో సాయి దుర్గ తేజ్ చిత్రం సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్లో కనిపించనున్నారు. బ్లాక్బస్టర్ హనుమాన్తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఈ మాజీ మంత్రి స్పందించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రాథమిక ఆధారాలు కూడా లేకున్నా కేసులు బనాయిస్తోందని ఆమె ఆరోపించారు.