శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (09:01 IST)

లాడ్జిలో ఉరివేసుకున్న నిట్ విద్యార్థి.. ఎందుకంటే...

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికింద

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికిందనే ఆవేదనతో జగిత్యాల జిల్లా వాసి పెంటపర్తి సురేందర్‌ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. 
 
జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన సురేందర్‌ పాట్నాలోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. బుధవారం గోలక్‌పూర్‌లోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ సెలక్షన్ విషయంలో సురేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని స్నేహితులు తెలిపారని తీర్భవార్‌ ఇన్‌స్పెక్టర్‌ గులాం సర్వర్‌ పేర్కొన్నారు.