శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2017 (11:20 IST)

రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే?

పండ్లరసాలతో బరువు తగ్గొచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అయితే ఆ పండ్ల రసాలు ఇంట్లో తయారు చేసినవిగా వుండాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. జంక్ ఫుడ్స్ ఒబి

పండ్లరసాలతో బరువు తగ్గొచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అయితే ఆ పండ్ల రసాలు ఇంట్లో తయారు చేసినవిగా వుండాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. జంక్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తున్నాయి. శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ఎక్సర్‌ సైజులతో పాటు పండ్ల రసాలను తీసుకోవాలి. కీరదోస, టమోట, క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్, పుచ్చకాయ, నిమ్మరసాన్ని రోజూకో గ్లాసు తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. 
 
ఉదయం ఆరు గంటలకు లేవగానే కొత్తిమీర జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకోవాలి. ఉదయం 11 గంటలకు బత్తాయి జ్యూస్.. మధ్యాహ్నం బొప్పాయి జ్యూస్ తీసుకోవాలి. అలాగే సాయంత్రం కమలాపండ్ల జ్యూస్ తీసుకోవాలి. రాత్రి 8 గంటలకు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రించేందుకు ముందు గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఈ జ్యూస్‌తో పాటు అల్పాహారంలో కోడిగుడ్డు, మధ్యాహ్న భోజనంలో పోషకాలు వుండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంలో చపాతీలు తీసుకోవడం చేస్తే బరువు తగ్గడం సులభం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.