శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (09:39 IST)

చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ సమర్పించారు. 
 
రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని శపథం చేశానని తెలిపారు. 
 
అందువల్లే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని ఆమె దుయ్యబట్టారు.