వృషభం :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పత్రికా సంస్థలలోనివారు ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. శారీరకశ్రమ వల్ల ఆరోగ్యంలో...Read More
కర్కాటకం :- భాగస్వామిక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ రంగాల్లో వారికి...Read More
సింహం :- స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. మీ...Read More
తుల :- స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన...Read More
వృశ్చికం :- ముఖ్యులతో సంప్రదింపులు, వ్యాపార లావాదేవీలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికం. భాగస్వామిక, సొంత...Read More
మకరం :- రియల్ ఎస్టేట్ వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టర్లకు రావలసిన...Read More
కుంభం :- కుటుంబ విషయాలపట్ల శ్రద్ద వహించండి. స్వయంకృషితో రాబడికి మించి ఖర్చులుంటాయి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఏ...Read More
తనకు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా చేయాలనివుందని 'మీన్ గర్ల్స్' అవంతిక అంటున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు వీలుగా టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల వంటివారిని త్వరలోనే కలుస్తానని ఆమె చెప్పారు. 'మీన్ గర్ల్స్' చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన అవంతిక.. 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే సిరీస్ ద్వారా మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. యూత్లో చాలా వేగంగా ఫాలోయింగ్ను కలిగిన ఆమె... తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను వెల్లడించారు. 'మీన్ గర్ల్స్'కి వెళ్లొచ్సిన మూడు నెలల తర్వాత తనకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. దీంతో తనకు అవకాశం రాదని భావించాను. కానీ, ఓ రోజున పిలుపు రావడంతో నమ్మలేకపోయాను. ఆ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.
రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ రెండు దశల్లో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25వ తేదీన ప్రటించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో కడప లోక్సభ స్థానం నుంచి ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిలను బరిలోకి దించాలని నిర్ణయించింది. అలాగే, ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటే పోలింగ్ జరుగనుంది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించనుంది. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్టు తెలుస్తుంది.