సంబంధిత వార్తలు
- ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరంజీవి... ఎందుకంటే??
- రామ్ చరణ్పై బడా నిర్మాతల అసహనం.. చిరంజీవి ఫిర్యాదు.. ఎందుకు?
- 130 కోట్ల మంది భారతీయులు చూడాల్సిన చిత్రం సైరా : తెలంగాణ గవర్నర్
- సైరా అద్భుతం, 130 కోట్ల మంది చూడాల్సిన సినిమా: తెలంగాణ గవర్నర్(Video)
- బన్నీ చెప్పింది నాకు కిక్ ఇవ్వలా, సైరా రిజల్ట్ గురించి చిరంజీవి
11న జగన్తో చిరంజీవి - రాం చరణ్ భేటీ.. సైరాను చూడాలంటూ..
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్ను చిరంజీవి కోరనున్నారు.
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.
