1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RRR Survey: Less Than 25 Seats For YCP

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

raghurama krishnam raju
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.  పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
 
అయితే ఇదే ఎన్నికల్లో వైసీపీ 25 ఎమ్మెల్యే సీట్లకు మించదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అధ్వాన్న పరిపాలన ఫలితం జగన్‌ను వెంటాడుతుందని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.
 
 
 
టీడీపీ+ కూటమి అధికారంలోకి వస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
తర్వాతి కథనం
యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?